Balakrishna Veera Simha Reddy : బాల‌కృష్ణ స్పీచ్ అదుర్స్

అన్ని కులాల‌కు చెందిన వాడిని

Balakrishna Veera Simha Reddy : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను అన్ని కులాల‌కు చెందిన వాడినంటూ పేర్కొన్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ‌, శృతి హాస‌న్ జంట‌గా న‌టించిన వీరసింహారెడ్డిప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రం చేశారు. ఒంగోలు ల ఓని అర్జున్ ఇన్ ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా బాల‌య్య స్పీచ్ కు అభిమానులు కేరింత‌లు కొట్టారు. జ‌న‌వ‌రి 12న మీ ముందుకు వ‌స్తున్నా. మ‌రోసారి బాక్సులు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌మ‌న్నారు బాల‌కృష్ణ‌. ఎన్నో సినిమాలు చేసినా ఇంకా క‌సి తీర‌లేదని అన్నారు. క‌ళామ‌త‌ల్లి ఎంద‌రికో నీడ‌నిస్తోందని దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు బాల‌య్య‌.

భిన్న‌మైన పాత్ర‌లు చేసి న‌న్ను నేను నిరూపించు కోవాల‌నే కోరిక త‌న‌కు అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్నారు. నాకు జ‌న్మ‌నిచ్చిన బ‌స‌వ‌తార‌కం, నంద‌మూరి తార‌క రామారావుకు రుణ‌ప‌డి ఉన్నాన‌ని చెప్పారు బాల‌కృష్ణ‌(Balakrishna Veera Simha Reddy). న‌ట‌న‌కు వ‌న్నె తెచ్చిన అరుదైన న‌టుడు ఎన్టీఆర్. ఆ మూడు అక్ష‌రాలు ప‌లికితే చాలు తెలుగు వారి గుండె గ‌ర్వంతో ఉప్పొంగుతుంద‌న్నారు.

ఆయ‌న సినిమాల‌తో క‌ళామ‌త‌ల్లి పండుగ చేసుకుంద‌న్నారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు బి. గోపాల్ ను అభినందించారు. ఇదే స‌మ‌యంలో ఒంగోలు గిత్త లాంటోడంటూ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనిని ఆకాశానికి ఎత్తేశారు బాల‌య్య‌. నా రాబోయే సినిమా ఒంగోలు బిడ్డ అనిల్ రావిపూడితో ఉంటుంద‌న్నారు.

తాను చేసిన అన్ స్టాప‌బుల్ ఇండియాలో నెంబ‌ర్ 1 గా నిలిచింద‌ని, దానికంత‌టికీ మీ ఆద‌రాభిమానాలే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు బాల‌కృష్ణ‌.

Also Read : విజ‌య్ సంగీత దూరం నిజ‌మేనా

 

Leave A Reply

Your Email Id will not be published!