Urvashi Rautela Pant : ఊర్వ‌శి రౌతేలా పోస్ట్ వైర‌ల్

రిషబ్ పంత్ ఆస్ప‌త్రి ఫోటో షేర్

Urvashi Rautela Pant : ఊర్వ‌శి రౌతేలా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమె ఇటీవ‌ల క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ వ్య‌వ‌హారంలో హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ఢిల్లీ నుంచి రూర్కీకు వెళుతుండ‌గా కారు ప్ర‌మాదానికి గుర‌య్యాడు రిష‌బ్ పంత్. దీంతో అత‌డిని హ‌ర్యానా రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కు చెందిన డ్రైవ‌ర్ , కండ‌క్టర్ కాపాడారు. డెహ్రాడూన్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అక్క‌డ చికిత్స చేయ‌డంతో బ‌తికి బ‌య‌ట ప‌డ్డాడు. ఇదే స‌మ‌యంలో శ‌స్త్ర చికిత్స చేయాల్సి ఉండ‌డంతో మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ మ్యాక్స్ ఆస్ప‌త్రి నుంచి ప్ర‌త్యేక విమానంలో ముంబైలోని రిల‌య‌న్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇప్ప‌టికే రిష‌బ్ పంత్ కు కావాల్సిన వైద్యానికి అయ్యే ఖ‌ర్చునంతా తాము భ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి.

మ‌రో వైపు ప్ర‌ధాన మంత్రి కూడా ఫోన్ లో ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇదే స‌మ‌యంలో బీసీసీఐ సైతం ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటోంది. అవ‌స‌ర‌మైతే శ‌స్త్ర చికిత్స కోసం లండ‌న్ కు త‌ర‌లించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా. ఇదిలా ఉండ‌గా రిష‌బ్ పంత్ అడ్మిట్ అయిన ముంబై ఆస్ప‌త్రి ఫోటోను తాజాగా షేర్ చేసింది ఊర్వశి రౌతేలా(Urvashi Rautela).

ఈ అమ్మ‌డికి పంత్ కు మ‌ధ్య సంవాదం చోటు చేసుకుంది. ఒక‌రినొక‌రు మాట‌ల తూటాలు పేల్చారు. ముంబై లోని కోకిలాబెన్ ధీరూ భాయ్ అంబానీ ఆస్ప‌త్రి చిత్రాన్ని షేర్ చేసింది. దీంతో రౌతేలా పంత్ ను సంద‌ర్శించిన‌ట్లు అర్థం అవుతోంది.

Also Read : బాల‌కృష్ణ స్పీచ్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!