RK Roja Nagababu : నాగ‌బాబు కామెంట్స్ రోజా సీరియ‌స్

మ‌హిళ అని చూడ‌కుండా అలా అంటారా

RK Roja Nagababu : ఏపీలో మాట‌ల యుద్దం మొద‌లైంది. ఇంకా ఎన్నిక‌లు రాలేదు. కానీ అప్పుడే ఎన్నిక‌ల వేడి ర‌గులుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. మ‌రింత ర‌క్తి క‌ట్టించేలా చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన ఆర్కే రోజా ప్ర‌స్తుతం ఏపీలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ప‌ర్యాట‌క శాఖ నిర్వ‌హిస్తున్నారు.

ఇక చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నాగ‌బాబుల‌పై(RK Roja Nagababu) ఈ మ‌ధ్య‌న కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ వ‌చ్చారు రోజా. ఒక‌ప్పుడు రోజా , నాగ‌బాబు ఇద్ద‌రూ జ‌బ‌ర్ద‌స్త్ షోకు న్యాయ నిర్ణేత‌లుగా ఉన్నారు. కానీ ఎందుక‌నో పార్టీల ప‌రంగా ఒక‌రిపై మ‌రొక‌రు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి దిగ‌జారారు.

మంత్రి రోజా సీరియ‌స్ గా స్పందించారు నాగ‌బాబుపై. ఒక మ‌హిళ అని చూడ‌కుండా చుల‌క‌న చేసి మాట్లాడ‌తారా అంటూ మండిప‌డ్డారు. అందుకే ముగ్గురు అన్న‌ద‌మ్ముల‌ను ఓడించారంటూ ఎద్దేవా చేశారు. వారికి రాజ‌కీయంగా భ‌విష్య‌త్తు లేద‌న్నారు ఆర్కే రోజా. అయితే రోజాను ఉద్దేశించి నాగబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

నీ ప‌ర్యాట‌క శాఖ దేశంలో 18వ స్థానంలో ఉంద‌న్నారు. ప‌ర్య‌ట‌నలు చేయ‌డం ప‌ర్యాట‌క శాఖ కాదంటూ ఎద్దేవా చేశారు. దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ఆర్కే రోజా. స‌మాచారం తెలుసుకోకుండా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. దేశ ప‌ర్యాట‌క రంగంలో ఏపీ మూడ‌వ స్థానంలో ఉంద‌న్నారు ఆర్కే రోజా.

ఇక‌నైనా నాగ‌బాబు కొంచం ప‌ద్ద‌తిగా మాట్లాడితే బెట‌ర్ అన్నారు. నోరు ఉంది క‌దా అని ఏది ప‌డితే అది మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు ఆర్కే రోజా.

Also Read : కామారెడ్డి రైత‌న్న‌ల‌కు పాల్ స‌లాం

Leave A Reply

Your Email Id will not be published!