Chetan Sharma Continuous : సెలక్షన్ కమిటీ చైర్మన్ గా చేతన్ శర్మ
ప్రకటించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు
Chetan Sharma Continuous : ఎంతో ఉత్కంఠ రేపిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ చైర్మన్ గా తిరిగి చేతన్ శర్మ(Chetan Sharma) నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా శనివారం ప్రకటించింది. 2020 డిసెంబర్ నుండి గత ఏడాది చివరి వరకు పురుషుల క్రికెట్ జట్టు కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి చీఫ్ గా ఉన్నారు. తాజా ప్రకటనతో ఆయన రెండోసారి తన పదవిని నిలబెట్టుకున్నారు. ఇక నుంచి చీఫ్ సెలెక్టర్ గా ఉంటారని స్పష్టం చేసింది బీసీసీఐ.
అంతే కాకుండా కొత్తగా ఎంపిక కమిటీని కూడా ఖరారు చేసినట్లు తెలిపింది. ట్విట్టర్ వేదికగా అధికారికంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. ఇక చేతన్ శర్మ(Chetan Sharma) కంటిన్యూగా సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతుండగా ఆయనతో పాటు మరో నలుగురికి కమిటీలో చోటు కల్పించింది బీసీసీఐ. చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మను సిఫార్సు చేయడంతో పాటు సభ్యులుగా శివ సుందర్ దాస్ , సుబ్రొతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ సెలక్షన్ కమిటీలో భాగం కానున్నారు.
ఇదిలా ఉండగా చేతన్ శర్మ చైర్మన్ గా ఉండడం వల్ల దేశంలో కొన్ని ప్రాంతాలకే ప్రయారిటీ దక్కుతోందని, ఇతర ఆటగాళ్లకు అవకాశం రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి ఆయన ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జట్లలో ప్రధానంగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మొత్తంగా మరోసారి చేతన్ శర్మ తన పంతం నెగ్గించుకున్నాడు.
Also Read : ఇప్పట్లో ఆ ఆలోచన లేదు – స్మిత్
NEWS 🚨- BCCI announces All-India Senior Men Selection Committee appointments.
Mr Chetan Sharma recommended for the role of Chairman of the senior men’s selection committee.
More details 👇👇https://t.co/K5EUPk454Y
— BCCI (@BCCI) January 7, 2023