Chiranjeevi K Viswanath : తండ్రిని కోల్పోయాను – చిరంజీవి

కె.విశ్వ‌నాథ్ లేక పోవ‌డం బాధాక‌రం

Chiranjeevi K Viswanath : ఏం మాట్లాడో అర్థం కావ‌డం లేదు. నాకు మార్గ‌ద‌ర్శ‌కుడిగా ఉంటూ వ‌చ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న తీసిన ప్ర‌తి చిత్రం ఓ క‌ళాఖండం. కె. విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌యం కృషి సినిమాలో న‌టించాను. ఎన్నో విష‌యాలు ఆయ‌న నుంచి నేర్చుకున్నాన‌ని అన్నారు న‌టుడు చిరంజీవి.

ఇవాళ నా శ‌రీరంలో ఓ భాగం కోల్పోయిన‌ట్లుగా భావిస్తున్నా. క‌న్నీళ్లు ఆపుకోలేక పోతున్నా. న‌న్ను కొడుకు కంటే ఎక్కువ‌గా చూసుకున్నారు. తెలుగు సినిమా రంగానికి ప్ర‌త్యేకించి నాకు తీర‌ని న‌ష్టం. ఒక ర‌కంగా చెప్ప‌లేని లోటు అని వాపోయారు. ఇంత‌కంటే ఏం మాట్లాడ‌గ‌ల‌ను. ఆయ‌న ఎక్క‌డున్నా ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు చిరంజీవి.

ఆయ‌న ఎన్నో క‌ళాఖండాల‌ను తీశారు. ప్ర‌తి సినిమా ఓ పుస్త‌కం. జీవితాన్ని ప్ర‌భావితం చేసేవి ఆయ‌న సినిమాలు. న‌న్ను నేను తీర్చిదిద్దుకునేలా చేసిన ఘ‌న‌త కె. విశ్వనాథ్ అని ప్ర‌శంసించారు చిరంజీవి(Chiranjeevi K Viswanath). క‌ళా హృద‌యం క‌లిగిన మ‌హోన్న‌త ద‌ర్శ‌కుడు అని ప్ర‌శంసించారు. కె. విశ్వ‌నాథ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు.

ఆయ‌న‌ను ఎన్నో అవార్డులు , పుర‌స్కారాలు వ‌రించాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయ‌న‌న‌ను ఘ‌నంగా స‌త్క‌రించింది. 1992లో ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది.

కె. విశ్వనాథ్ స్వ‌స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లా రేప‌ల్లె. ఆయ‌న వ‌య‌స్సు 92 ఏళ్లు. త‌న జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. 1961లో ఆత్మ గౌర‌వం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న కుల వ్య‌వ‌స్థ‌, వైక‌ల్యం, అంట‌రానిత‌నం, లింగ వివ‌క్ష‌, వ‌ర‌క‌ట్నం, సామాజిక ఆర్థిక స‌వాళ్లు వంటి ఇతివృత్తాల‌తో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Also Read : సినిమా చేసుకున్న పుణ్యం

Leave A Reply

Your Email Id will not be published!