Delhi Budget Doubt : సిసోడియా అరెస్ట్ డైలమాలో బడ్జెట్
ఢిల్లీ ప్రభుత్వంలో సంక్షోభం
Delhi Budget Doubt : ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబర్ టు గా ఉంటూ వచ్చిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యారు. అంతకు ముందు మరో మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. సిసోడియా కూడా జైలుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేంద్ర సర్కార్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చింది ఆప్. ఇక ఆప్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రులుగా ఉన్నారు జైన్, సిసోడియా.
ఇక సిసోడియా మొదట్లో రేడియో జాకీగా, జర్నలిస్ట్ గా పని చేశారు. 2013 నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ కు అనుంగు అనుచరుడిగా, నమ్మకమైన బంటుగా ఉంటూ వచ్చారు. ఒక రకంగా ప్రభుత్వానికి అండగా ఉంటూ వచ్చారు. ఒకటి కాదు ఏకంగా 18 శాఖలు నిర్వహిస్తూ వచ్చారు మనీష్ సిసోడియా. తాజాగా సిసోడియా అరెస్ట్ తో అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్ ఉంటుందా ఉండదా అన్న అనుమానం నెలకొంది.
ఒక రకంగా ఢిల్లీ సర్కార్ సంక్షోభంలో కూరుకు పోయిందని చెప్పక తప్పదు. విద్య, ఆరోగ్య శాఖల పరంగా మనీష్ సిసోడియా మంచి పేరు సంపాదించారు. ఇక కేబినెట్ లో జైన్ ,సిసోడియా లేక పోవడం కేజ్రీవాల్ ప్రభుత్వానికి మైనస్ అని చెప్పవచ్చు. తాజా బడ్జెట్ ను ఎవరు ప్రవేశ(Delhi Budget Doubt) పెడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ సర్కార్ బడ్జెట్ ను రెవిన్యూ శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ సమర్పించనున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆప్ కూడా ధ్రువీకరించింది.
Also Read : ఆప్ లో నెంబర్ 2 మనీష్ సిసోడియా