Jayaprakash Narayan : జేపీ స్వరం బీఆర్ఎస్ జపం
బీఆర్ఎస్ సర్కార్ సూపర్
Jayaprakash Narayan : హైదరాబాద్ – సీనియర్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ , లోక్ సత్తా పార్టీ చీఫ్ జయప్రకాశ్ నారాయణ్(Jayaprakash Narayan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ వేదికగా జేపీ ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో ముచ్చటించారు.
Jayaprakash Narayan Viral
ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు దేశాన్నే పణంగా పెడుతోందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలు సర్వ నాశనం అయి పోతాయంటూ సంచలన కామెంట్స్ చేశారు జేపీ.
తాను దళిత బంధు పొందిన ఓ యువకుడితో మాట్లాడానని, అతడు చెప్పింది విని తాను చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు . ప్రస్తుతం సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని కితాబు ఇచ్చారు లోక్ సత్తా చీఫ్.
గతంలో ఎన్నడూ లేని రీతిలో హైదరాబాద్ లో ఐటీ రంగం భారీగా విస్తరించిందని, కుల, మతాలకు అతీతంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతోందని స్పష్టం చేశారు. దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, తదితర పథకాలు ఆదర్శ ప్రాయంగా ఉన్నాయని ప్రశంసించారు జయప్రకాశ్ నారాయణ్.
Also Read : MLC Kavitha : కవితకు ఆక్స్ ఫర్డ్ ఆహ్వానం