ముంబై : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు, మాజీ అధికారులపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి రెండు పీఎంఎల్ఏ కేసుల్లో ఈడీ ఛార్జిషీట్స్ దాఖలు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా వెల్లడించింది. దోషిని జూన్లోనూ, సేత్ను జూలైలోనూ ఈడీ అరెస్టు చేసింది.. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో జైలులో ఉన్నారు. దోషి 2020లో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ నుండి వైదొలిగారు. నిధుల ప్రవాహం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా దాని ప్రత్యేక ప్రాజెక్ట్ సంస్థలు లేదా ఈపీసీ కాంట్రాక్టర్ల నుండి నిర్మాణ కాంట్రాక్టర్లకు, ఆ తర్వాత రోడ్డు నిర్మాణంతో ఎటువంటి సంబంధం లేని ‘షెల్’ సంస్థలకు చేరిందని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
మొదటి సందర్భంలో ద్వారకాలోని ప్రత్యేక మనీ-లాండరింగ్ నివారణ చట్టం కోర్టులో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ గ్రూప్ మాజీ అధికారి సతీష్ సేత్ ఇతరులపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (ఛార్జ్షీట్) దాఖలు చేశారు. సేత్ను జూన్లో ఈడీ అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో జైలులో ఉన్నారు. తను 2025లో రిలయన్స్ గ్రూప్ నుండి వైదొలిగారు. రెండవ సందర్భం రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కేసులో రౌస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టులో ఫెడరల్ ఏజెన్సీదాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్కు సంబంధించినది. ఈ కేసులో ప్రధాన ఛార్జ్షీట్ను ఈడీ మార్చిలో దాఖలు చేసింది. మనీ లాండరింగ్ కింద దాఖలు చేసిన ఈ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో ఆర్ కామ్ , రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రాగ్ మాజీ అధికారులు సేత్, గౌతమ్ దోషి, అమితాబ్ ఝున్ఝున్వాలా, ఇతరులను నిందితులుగా పేర్కొన్నట్లు ఏజెన్సీ తెలిపింది.
