BJP Protest : బీజేపీ టికెట్ పై ఆగ్ర‌హం

సిరిసిల్ల‌లో ప‌ద్మశాలీలు ఫైర్

BJP Protest : సిరిసిల్ల – తెలంగాణ‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి 119 సీట్ల‌కు గాను తొలి విడ‌త‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ 52 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో పార్టీ త‌ర‌పున బీజేపీ నుంచి రాణి రుద్ర‌మ దేవికి టికెట్ కేటాయించింది. ఆమెకు ఎలాంటి అనుభవం లేద‌ని, ఎవ‌రి ప్ర‌మేయంతో టికెట్ కేటాయించారంటూ స్థానిక బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భ‌గ్గుమ‌న్నారు.

BJP Protest Viral

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ద్మ‌శాలి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఎక్కువ‌గా ఉన్నారు. వీరి ఓటు బ్యాంకు కీల‌కం కానుంది. నిన్న‌టి వ‌ర‌కు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన ల‌గిశెట్టి శ్రీ‌నివాస్ పార్టీ కోసం ముందు నుంచీ ప‌ని చేస్తున్నారు. బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

చివ‌రి వ‌ర‌కు త‌న‌కు బీజేపీ(BJP) త‌ర‌పు నుంచి టికెట్ వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ ఆయ‌న ఆశ‌లు ఆవిర‌య్యాయి. నిరాశ‌కు లోను చేస్తూ బీజేపీ హై క‌మాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. ల‌గిశెట్టి శ్రీ‌నివాస్ కు కాకుండా ఇటీవ‌లే బీజేపీలోకి జంప్ అయిన రాణి రుద్ర‌మ దేవికి కేటాయించారు. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ దిష్టి బొమ్మ‌ను ద‌హ‌నం చేశారు.

Also Read : Komatireddy Raja Gopal Reddy : హ‌స్తం గూటికి కోమ‌టిరెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!