YS Sharmila Invites : సీఎం రేవంత్ రెడ్డిని తన తనయుడి పెళ్ళికి ఆహ్వానించిన షర్మిల

తన కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న వైఎస్ షర్మిల

YS Sharmila : ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన ఆమె తన కుమారుడి నిశ్చితార్ధానికి, పెళ్లికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిలకు సీఎం శాలువా కప్పి ప్రశంసించారు. అనంతరం షర్మిల తన కుమారుడి పెళ్లి పత్రికను రేవంత్ రెడ్డికి అందజేశారు. తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని సీఎం రేవంత్‌ను వైఎస్‌ షర్మిల కోరారు. నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా షర్మిల(YS Sharmila) వారిని ఆహ్వానించారు. దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కాబోయే వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సీఎం. రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ కార్యక్రమం ఈ నెల 18న జరగనుంది.

YS Sharmila Invites CM Revanth Reddy

ఆ తర్వాత ఫిబ్రవరి 17న పెళ్లి జరగాల్సి ఉంది. షర్మిల ప్రస్తుతం కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద పెళ్లిపత్రికను ఉంచి, ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు స్వీకరించారు. అనంతరం తాడేపల్లికి వెళ్లి తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ను పెళ్లికి ఆహ్వానించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు.

Also Read : CM Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌రెడ్డి నియామకం

Leave A Reply

Your Email Id will not be published!