MP K Sudhakar: విందులో ఉచితంగా ‘మద్యం’పంపిణీ చేసిన బీజేపీ ఎంపీ !

విందులో ఉచితంగా ‘మద్యం’పంపిణీ చేసిన బీజేపీ ఎంపీ !

MP K Sudhakar: కర్ణాటకలో బీజేపీ ఎంపీ మద్దతుదారులు ఏర్పాటు చేసిన కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కె.సుధాకర్‌… స్థానికంగా కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్యక్రమంలో ఉచితంగా ‘మద్యం’పంపిణీ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఎంపీ ఉచితంగా పంపిణీ చేస్తున్న మద్యం తీసుకునేందుకు భారీ సంఖ్యలో ముందుప్రియులు క్యూ కట్టగా… పోలీసులే బందోబస్తు నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌… ఈ వ్యవహారంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

MP K Sudhakar…

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కె.సుధాకర్‌(MP K Sudhakar) ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపుర్‌ నుంచి విజయం సాధించారు. ఈ సందర్భంగా స్థానికంగా కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆయన మద్దతుదారులు… ఉచితంగా మద్యం పంపిణీ చేపట్టారు. దీనికి జనం ఎగబడ్డారు. భారీ ‘క్యూ’ లైను ఉండగా… ఆ తతంగాన్నంతా పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఈ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించాలని ఎంపీ సుధాకర్‌ స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌… బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీ సంస్కృతి ఇదేనని ఆరోపించిన ఆయన.. దీనిపై జేపీ నడ్డా స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటారా ? అన్న ప్రశ్నకు బదులిస్తూ… ఆ విషయం తర్వాత అని, తొలుత కాషాయ పార్టీ నుంచి ఎటువంటి సమాధానం వస్తోందో చూడాలన్నారు.

Also Read : PM Narendra Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా చేరుకున్న ప్రధాని మోదీ !

Leave A Reply

Your Email Id will not be published!