CM Chandrababu : నూజివీడు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై స్పందించిన చంద్రబాబు, లోకేష్

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు...

CM Chandrababu : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్‌లోని వాష్ రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), విద్య, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాలు జారీ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై తక్షణ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈ ఘటనపై నారా లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రహస్య కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

CM Chandrababu React..

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కళాశాలలో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలనూ గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనను విరమింపజేశారు. బాలికల హాస్టల్ వాష్ రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వియ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిలు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై… తోటి విద్యార్థులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్‌కు పోలీసులు చేరుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకూ ఇంజినీరింగ్ కళాశాలలో ఆందోళన కొనసాగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థికి.. మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ విద్యార్థులంతా ఆరోపిస్తున్నారు.

Also Read : CM Revanth Reddy : సుప్రీంకోర్టు సీరియస్ కావడంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!