న్యూఢిల్లీ : భారత దేశంలో అత్యున్నత కీలకమైన పదవిగా భావించే ఇండియన్ ఆర్మీ చీఫ్ పదవి ఇప్పుడు కీలకంగా మారింది. తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమించే చాన్స్ ఉంది. తన ఎంపిక విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు సమాచారం. రక్షణ పరంగా ఈ పోస్ట్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఉత్కంఠకు తెర దించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా జూన్ 30న ఇప్పటికు భారత ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఆయన ఈనెలాఖరులో పదవీ విరమణ పొందనున్నారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ధీరజ్ సేథ్ పని చేస్తున్నారు. ఈ తరుణంలో తనకే ఆర్మీ బాస్ గా కొలువు తీరేందుకు మార్గం సుగమమైంది.
ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేసే సమయానికి అంటే జూన్ 30 మధ్యాహ్నం సేథ్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ‘వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్’గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ సేథ్ 1997 తర్వాత ఆర్మీకి నాయకత్వం వహించనున్న మొదటి ‘ఆర్మర్డ్ కార్ప్స్’ అధికారి కానున్నారు. అంతకు ముందు ఆయన సౌత్ వెస్ట్రన్ , సదరన్ కమాండ్లకు నాయకత్వం వహించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ఆయన, డిసెంబర్ 1986లో ఆర్మర్డ్ కార్ప్స్లో నియమితులయ్యారు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో, ఆయన వివిధ రంగాలలో కార్యాచరణ , వ్యూహాత్మక, సిబ్బందికి సంబంధించిన కీలక బాధ్యతలను నిర్వహించారు.
ఆయన నిర్వహించిన కమాండ్ బాధ్యతలలో ఎడారి ప్రాంతంలో ఆర్మర్డ్ రెజిమెంట్కు, పశ్చిమ ప్రాంతంలో ఆర్మర్డ్ బ్రిగేడ్కు, జమ్మూ కాశ్మీర్లో తిరుగుబాటు వ్యతిరేక దళానికి నాయకత్వం వహించడం వంటివి ఉన్నాయి. లెఫ్టినెంట్ జనరల్గా, ఆయన సుదర్శన్ చక్ర కార్ప్స్కు నాయకత్వం వహించారు . ఆ తర్వాత ‘జనరల్ ఆఫీసర్ కమాండింగ్, ఢిల్లీ ఏరియా’గా పనిచేశారు. ఆర్మీ కమాండర్గా పదోన్నతి పొందిన తర్వాత, ఆయన సౌత్ వెస్ట్రన్ కమాండ్, సదరన్ కమాండ్ రెండింటికీ నాయకత్వం వహించి, రెండేళ్ల పాటు కీలకమైన కార్యాచరణ ప్రాంతాలను పర్యవేక్షించారు.