Bhagyashree : మైనే ప్యార్ కియా మూవీతో తళుక్కున మెరిసిన నటి భాగ్యశ్రీ. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ లో ఆమె తల్లిగా నటించింది.
హీరో ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. రాధాకృష్ణ కుమార్ దీనికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ దుమ్ము రేపింది.
అంతే కాదు ఇటీవల విడుదల చేసిన సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ తరుణంలో హీరోగా నటించిన ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించింది భాగ్యశ్రీ. గతంలో హిందీ, మరాఠీ, కన్నడ, భోజపురి భాషల్లో పలు పాత్రల్లో నటించి మెప్పించింది.
20 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై సందడి చేయబోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ మూవీలో తల్లిగా సందడి చేయనున్నారు. ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అంచనాలతో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా భాగ్యశ్రీ (Bhagyashree)మీడియాతో మాట్లాడారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటిగా మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకున్న సమయంలో తలైవి, రాధే శ్యామ్ మూవీ నుంచి ఆఫర్లు వచ్చాయన్నారు.
యంగ్ మదర్ గా ఉండాలని తమను అడిగామన్నారు. విచిత్రం ఏమిటంటే ప్రభాస్ కు తల్లిగా నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు భాగ్యశ్రీ.
తను స్టార్ హీరో అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉండడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు. రాధే శ్యామ్ ను చూసి ఆదరించాలని కోరారు.
Also Read : 27న కేజీఎఫ్-2 ట్రైలర్ రిలీజ్