ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను లేపేస్తామని డెడ్ లైన్
అమెరికా : అమెరికా దేశాధినేత డొనల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దారికి వస్తే సరి లేక పోతే చర్యలు తప్పవన్నారు. హోర్ముజ్లో దాడులకు ప్రతీకారంగా వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామన్న తన మునుపటి బెదిరింపులను అధ్యక్షుడు పునరుద్ఘాటించారు . హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఒక నౌకపై కాల్పులు జరిపిన ప్రతిసారీ, అమెరికా ఒక వంతెన లేదా విద్యుత్ ప్లాంట్ను ధ్వంసం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఝలక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇరాన్పై అమెరికా మరో విడత దాడులు జరిపిన తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది. ఈ దాడులలో రాజధాని టెహ్రాన్పై వైమానిక రక్షణ వ్యవస్థలు కాల్పులు జరిపాయి.
ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని జోర్డాన్ నగరంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. బహ్రెయిన్, సౌదీ అరేబియాలలో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. సోషల్ మీడియాలో తన హెచ్చరికలో, ఇరాన్ దాడులకు ప్రతీకారంగా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామన్న తన పాత బెదిరింపులను అధ్యక్షుడు పునరుద్ఘాటించడం గమనార్హం. ఇక నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో క్షిపణి, రాకెట్, డ్రోన్ లేదా మరే ఇతర పరికరం లేదా ఆయుధంతో నైనా ఓడపై కాల్పులు జరిపినప్పుడల్లా, యునైటెడ్ స్టేట్స్ ఒక వంతెన లేదా విద్యుత్ ప్లాంట్పై బాంబు వేసి ధ్వంసం చేస్తుంది అని సంచలన ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. తన సోషల్ మీడియాలో ట్రూత్ లో పేర్కొన్నారు. ప్రపంచ ఇంధనానికి కీలకమైన జలమార్గమైన హోర్ముజ్ జలసంధిపై తమ వివాదంలో ఇరుపక్షాల అధికారులు తమ పట్టును వదలడం లేదు. ఇరాన్ దాడుల కారణంగా ఈ జలసంధి చాలా వరకు మూసి వేయబడింది.
