Dhoni Gambhir : దిగ్గ‌జాల క‌ల‌యికతో ఫ్యాన్స్ ఖుషీ

ధోనీ..గౌతం గంభీర్ మాట ముచ్చ‌ట

Dhoni Gambhi : వాళ్లిద్ద‌రూ క్రికెట్ (Cricket)దిగ్గ‌జాలు. ఒక‌రు ఇప్ప‌టికీ క్రికెట్ ఆడుతుండ‌గా మ‌రొక‌రు మెంటార్ గా ఉన్నారు. ప్ర‌స్తుతం మ‌హేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూప‌ర్ కింగ్స్ లో ఆడుతుండ‌గా గంభీర్ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీగా, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు మెంటార్ గా ప‌ని చేస్తున్నారు.

ఐపీఎల్ 2022 (IPL) లో భాగంగా ముంబై వేదిక‌గా సీఎస్కే (CSK) , సీఎస్జీ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో ల‌క్నో జెయింట్స్ (LSG)ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఈ సంద‌ర్భంగా ధోనీ (Dhoni) ఆవేశ్ ఖాన్ తో మాట్లాడుతుండ‌గా గౌతం గంభీర్ (Gambhir) అక్క‌డికి రావ‌డం తో ఒక్క‌సారిగా కెమెరా క‌ళ్లు క్లిక్ మ‌నిపించాయి. ఒక‌ప్పుడు ధోనీ, గంభీర్(Dhoni Gambhi) క‌లిసి ఆడారు. ఆయ‌న సార‌థ్యంలో గౌత‌మ్ ప‌రుగులు చేశాడు. కీల‌క పాత్ర పోషించాడు.

వీరిద్ద‌రూ భార‌త జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టారు. దీంతో ఇద్ద‌రు క్రికెట్ (Cricket) దిగ్గ‌జాలు క‌లుసు కోవ‌డంతో ఇరు క్రికెట‌ర్ల అభిమానులు సంతోషానికి లోన‌వుతున్నారు.

సోష‌ల్ మీడియాలో గౌతం గంభీర్ ధోనీతో క‌లుసుకున్న ఫోటోను షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. తాను ఇప్ప‌టికీ ధోనీని కెప్టెన్ గా భావిస్తున్నాన‌ని తెలిపాడు గంభీర్ (Gambhir) .

విచిత్రం ఏమిటంటే ధోనీ, గంభీర్ కెరీర్ లో పీక్ స్టేజికి చేరుకున్నారు. ఐపీఎల్ లో కేకేఆర్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ దిగ్గ‌జాలు ఇలాగే ఉండాల‌ని అభిమానులు కోరుతున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ క‌లిసిన వీడియో వైర‌ల్ గా మారింది.

Also Read : పాకిస్తాన్ సంచ‌ల‌నం ఆసిస్ ప‌రాజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!