Mahela Jayawardene : మా ఆట తీరు మారాల్సి ఉంది

కోచ్ మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే

Mahela Jayawardene  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ ప్రారంభ‌మైనా ఈరోజు వ‌ర‌కు మూడు మ్యాచ్ లు ఆడి ఓట‌మి పాల‌వ‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ఆ జ‌ట్టు హెడ్ కోచ్, శ్రీ‌లంక క్రికెట్ దిగ్గ‌జం మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే(Mahela Jayawardene ).

త‌మ ఆట తీరు మారాల్సి ఉంద‌న్నారు. క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌క పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. తమ జ‌ట్టు అద్భుతంగా ఆడుతోంద‌ని కానీ విజ‌యం సాధించ‌డంలో మాత్రం స‌క్సెస్ కాలేక పోతున్నామ‌ని పేర్కొన్నాడు.

ప్ర‌ధానంగా గెలుపు అంచుల దాకా వ‌చ్చామ‌ని కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో. కానీ ఎప్పుడైతే ఆసిస్ స్టార్ ప్లేయ‌ర్ పాట్ క‌మిన్స్ మైదానంలోకి వ‌చ్చాడో మ్యాచ్ స్వ‌రూపం పూర్తిగా మారి పోయింద‌న్నాడు.

అత్యంత విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ గా పేర్కొన్నాడు. ఆ స‌మ‌యంలో ఏ జ‌ట్టు ఉన్నా ఇదే ప‌రిస్థితి ఎదుర్కొని ఉండేద‌ని పేర్కొన్నాడు మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే.

ఇదిలా ఉండ‌గా మూడు మ్యాచ్ ల‌లో ఓడి పోయిన‌ప్ప‌టికీ త‌మ‌కు ఇంకా ఛాన్స్ ఉంద‌న్నాడు. ఇంకా మ్యాచ్ లు ఆడాల్సి ఉంద‌న్నాడు. మరింత మెరుగైన ఆట తీరును క‌న‌బ‌రుస్తామ‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశాడు హెడ్ కోచ్.

ఐపీఎల్ ప‌రంగా ఆట తీరు వేరుగా ఉంటుంద‌న్నారు. మ్యాచ్ ల ప‌రంగా చూస్తే ఆరంభం అద్భుతంగా ఉంటుంద‌ని కానీ ఫినిషింగ్ వ‌ర‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా అలా ఉండ‌డం లేద‌న్నారు మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే(Mahela Jayawardene ).

ప్ర‌త్యేకంగా బౌలింగ్ తీరు ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నాడు. ఇక కెప్టెన్ సైతం కొంత మంది ఆట‌గాళ్లు రాణించాలని సూచించారు.

Also Read : క‌మిన్స్ సెన్సేష‌న్ బాద్ షా డ్యాన్స్

Leave A Reply

Your Email Id will not be published!