Rashid Khan : తమ జట్టు అద్భుత విజయం సాధించడం వెనుక తమ కంటే తమ నాయకుడు హార్దిక్ పాండ్యా కృషి ఎక్కువగా ఉందన్నాడు గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్ ఖాన్.
ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో , ఎవరిని ఎక్కడ పెట్టాలో తనకు బాగా తెలుసు అన్నాడు. ఐపీఎల్ 2022 మెగా రిచ్ లీగ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ను 37 పరుగుల భారీ తేడాతో ఓడించింది.
దీంతో ఐపీఎల్ పట్టికలో టాప్ లో నిలిచింది గుజరాత్ టైటాన్స్ . కెప్టెన్ గా అద్భుతంగా రాణించాడు. 87 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
మరో వైపు స్టార్ హిట్టర్ గా పేరొందిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ను అద్భుతమైన బంతితో రనౌట్ చేసి పంపించాడు. అంతే కాదు మరోస్టార్ ప్లేయర్ ను తన బంతితో బోల్తా కొట్టించాడు.
మొత్తంగా నిన్నటి మ్యాచ్ తమది కాదని పూర్తిగా హార్దిక్ పాండ్యాదేనంటూ కితాబు ఇచ్చాడు ఆఫ్గనిస్తాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్. సారథి అన్నాక టెన్షన్ ఎక్కువగా ఉంటుందన్నాడు.
ఇది ప్రతి చోటా, ప్రతి జట్టులో కనిపించే వాతావరణమని పేర్కొన్నాడు రషీద్ ఖాన్. పాండ్యా ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటాడని కితాబు ఇచ్చాడు.
ప్రస్తుతం పరుగుల జాబితాలో సైతం హార్దిక్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. హార్దిక్ జట్టును నడిపించిన విధానం. జట్టు వాతావరణాన్ని, మైదానం లోపట, బయట ఉంచిన విధానం ఇప్పటి దాకా అద్బుతంగా ఉందన్నాడు ఖాన్.
Also Read : అశ్విన్ ను పంపడంపై సంజయ్ సెటైర్