Ram Charan : దుర్గ‌మ్మ స‌న్నిధిలో రామ్ చ‌ర‌ణ్ 

భారీగా త‌ర‌లి వ‌చ్చిన అభిమానులు 

Ram Charan : ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వ‌స్తున్న మెగా అభిమానుల‌కు సినిమా పండ‌గ రానే వ‌చ్చింది. స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరొందిన కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తండ్రీ కొడుకులు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ( చెర్రీ) (Ram Charan)  , పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆచార్య మూవీలో న‌టించారు.

ఈ మూవీపై పెద్ద ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి. భారీ బ‌డ్జెట్ తో సినిమాను తీశారు ద‌ర్శ‌కుడు. క‌రోనా కార‌ణంగా కొంత ఆల‌స్యం జ‌రిగింది. సినిమా షూటింగ్ పూర్త‌యింది.

ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన ఫోటోలు, టీజ‌ర్స్ , ట్రైల‌ర్ , పాట‌లు జ‌నాద‌ర‌ణ పొందాయి. ఈనెల 29న ఆచార్య సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్లు మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

దీంతో సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీ అయ్యారు ద‌ర్శ‌కుడు, న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణులు.

తాజాగా విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, న‌టుడు రామ్ చ‌ర‌ణ్‌(Ram Charan).

దీంతో బెజ‌వాడ‌లో భారీ ఎత్తున సాద‌ర స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా మెగా స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున చెర్రీని చూసేందుకు త‌ర‌లి వ‌చ్చారు.

దీంతో దుర్గ‌మ్మ ఆల‌యం క్రిక్కిరిసి పోయింది. ఆచార్య మూవీ స‌క్సెస్ కావాల‌ని అమ్మ వారిని కోరుకున్న‌ట్లు రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

అంత‌కు ముందు అభిమానులు న‌గ‌ర‌మంత‌టా ర్యాలీలు చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా దుర్గ‌గుడిలో

జై చ‌ర‌ణ్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క్యూ లైన్ల‌లో నిల్చున్న భ‌క్తులు ఇబ్బంది ప‌డ్డారు.

Also Read : ‘రన్‌వే 34’ అదిరింద‌న్న అమితాబ్‌

Leave A Reply

Your Email Id will not be published!