Ananth Sreeram : మహేష్ బాబు నిజంగా బంగారం

గేయ ర‌చ‌యిత అనంత్ శ్రీ‌రామ్

Ananth Sreeram : సినీ గేయ ర‌చ‌యిత అనంత్ శ్రీ‌రామ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ న‌టుడు ప్రిన్స్ మ‌హేష బాబు. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టించిన స‌ర్కారు వారి పాట ఈనెల 12న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇక చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్లు, టీజ‌ర్ , ట్రైల‌ర్ దుమ్ము రేపింది. ఇక పాట‌ల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. రికార్డుల మోత మోగిస్తున్నాయి.

 

తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ప్ర‌త్యేకించి తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వ‌డంలో త‌న‌కు సాటి లేరెవ్వ‌రు అని మ‌రోసారి నిరూపించుకున్నాడు.

స‌ర్కారు వారి పాట‌లో మ‌హేష్ బాబుతో పాటు కీర్తి సురేష్ , వెన్నెల కిషోర్, స‌ముద్ర ఖ‌ని ఉన్నారు. మొత్తం ఆరు పాట‌లు ఉంటే 5 పాట‌ల్ని అనంత్ శ్రీ‌రామ్(Ananth Sreeram)  రాశాడు. ఇక చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది.

దీనికి హాజ‌రైన గేయ ర‌చ‌యిత మ‌హేష్ బాబు ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. నిజంగా ప్రిన్స్ బంగారం కంటే గొప్పోడంటూ కితాబు ఇచ్చాడు. ఈ ఆర‌డుగుల అబ్బాయిని చూస్తే ఎవ‌రైనా ఇష్ట ప‌డ‌తారు.

ఇక అమ్మాయిలు మ‌న‌సు పారేసుకుంటారు. ఆయ‌న అందాన్ని చూసి అసూయ ప‌డ‌తార‌ని అన్నారు. ఇప్ప‌టి దాకా 12 వంద‌ల‌కు పైగా పాట‌లు రాశాను. కానీ స‌ర్కార్ వారి పాట‌కు ఎక్కువ క‌ష్ట ప‌డ్డాన‌ని చెప్పారు అనంత్ శ్రీ‌రామ్(Ananth Sreeram) .

ద‌ర్శ‌కుడి ముందు లొంగి పోయి వంగి పోయి పాట‌లు రాశాన‌ని తెలిపారు. థ‌మ‌న్ ఈ స్థాయి రావ‌డం వెనుక ఎంతో క‌ష్టం ఉంద‌న్నారు.

 

Also Read : సూప‌ర్ స్టార్ మంచి ఫీల్డ‌ర్ – థ‌మ‌న్

Leave A Reply

Your Email Id will not be published!