Ambati Rayudu : చివ‌రి ఐపీఎల్ అంటూ ట్వీట్ ఆపై తొల‌గింపు

సీఎస్కే క్రికెటర్ రాయుడు క‌ల‌క‌లం

Ambati Rayudu : ఆంధ్రా కుర్రాడు అంబ‌టి రాయుడు(Ambati Rayudu) సంచ‌ల‌నానికి తెర లేపాడు. ఇదే చివ‌రి ఐపీఎల్ అంటూ ట్వీట్ చేశాడు. ఆపై వెంట‌నే దానిని తొల‌గించాడు. ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022 ఆఖ‌రుదంటూ పేర్కొన్నాడు.

ఆ వెంట‌నే ఎందుక‌నో తాను చేసిన ట్వీట్ ను తానే డిలీట్ చేశాడు. ఇదే త‌న చివ‌రి సీజ‌న్ అని ప్ర‌క‌టించాడు. ఈ ట్వీట్ క‌ల‌క‌లం రేపింది. శ‌నివారం ట్వీట్ చేసిన రాయుడు ఏమైందో ఏమో కానీ వెంట‌నే తొల‌గించాడు.

త‌ను చేసిన ట్వీట్ లో ఇలా పేర్కొన్నాడు. ఇది నా చివ‌రి ఐపీఎల్ అని ప్ర‌క‌టించేందుకు సంతోషిస్తున్నాని తెలిపాడు. గ‌త 13 ఏళ్లుగా ఇది ఆడ‌టం , 2 గొప్ప జ‌ట్ల‌లో భాగ‌మైన అద్భుత‌మైన స‌మ‌యాన్ని క‌లిగి ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఐపీఎల్ లో త‌న‌కు చాన్స్ ఇచ్చి ప్రోత్స‌హించిన రెండు జ‌ట్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఆ జ‌ట్లు ముంబై ఇండియ‌న్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. కొన్నేళ్లుగా సీఎస్కే జ‌ట్టులో భాగం పంచుకున్నాడు.

జ‌ట్టును చాలా సార్లు ఒడ్డుకు చేర్చాడు. క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకున్నాడు. చాలా మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో 187 మ్యాచ్ లు ఆడాడు.

29.28 స‌గ‌టుతో ఏకంగా 4 వేల 187 ప‌రుగులు చేశాడు. టోర్నీలో 100 నాటౌట్. 2010 నుంచి 2017 దాకా ముంబై ఇండియ‌న్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

2018లో రాయుడిని సీఎస్కే కైవసం చేసుకుంది. రాయుడు(Ambati Rayudu) చేసిన ట్వీట్ పై ఫ్యాన్స్ ఎందుకంటూ ట్వీట్ చేశారు. ఆ త‌ర్వాత డిలీట్ చేయ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.

 

Also Read : కోహ్లీ ఫామ్ లోకి రావ‌డం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!