Johnny Depp : ఇండియ‌న్ రెస్టారెంట్ లో జానీ డెప్ సెల‌బ్రేష‌న్స్

రూ. 48 ల‌క్ష‌ల‌తో ఫ్రెండ్స్ కు భారీ విందు

Johnny Depp : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన హాలీవుడ్ దిగ్గ‌జ న‌టీ న‌టులు జానీ డెప్ , మాజీ భార్య అంబ‌ర్ హియ‌ర్డ్ కేసులో చివ‌ర‌కు తీర్పు డెప్ ను వ‌రించింది.

ఏకంగా $15 మిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట ప‌రిహారంగా జానీ డెప్ కు చెల్లించాల‌ని వ‌ర్జీనియా కోర్టు జ్యూరీ తీర్పు చెప్పింది. ఈ త‌రుణంలో ఎంతో టెన్ష‌న్ కు గురై చివ‌ర‌కు తీర్పు త‌న వైపు రావ‌డంతో ఆనందం త‌ట్టుకోలేక సెల‌బ్రేష‌న్స్ లో మునిగి పోయాడు న‌టుడు జానీ డెప్(Johnny Depp).

బ‌ర్మింగ్ హోమ్ లోని ఇండియ‌న్ (భార‌తీయ‌) రెస్టారెంట్ లో విక్ట‌రీ సెలబ్రేష‌న్స్ చేసుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆ మొత్తం ఆనందం కోసం చేసిన ఖ‌ర్చు అక్ష‌రాల రూ. 48 లక్ష‌లు మ‌న భార‌తీయ రూపాయ‌ల్లో.

ఇదిలా ఉండ‌గా ఈ హాలీవుడ్ స్టార్ జానీ డెప్ ను రెస్టారెంట్ సిబ్బంది డౌన్ టు ఎర్త్ బ్లాక్ గా ప్ర‌క‌టించారు. తీర్పు వ‌చ్చాక త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ ప్ర‌త్యేక వేడుక చేశాడు.

ఇందు కోసం భారీ ఎత్తున ఖ‌ర్చు చేశాడు. ఇదిలా ఉండ‌గా ఈ ఖ‌ర్చు చేసిన విష‌యాన్ని న్యూయార్క్ పోస్ట్ ప్ర‌త్యేక క‌థ‌నం రాసింది. ఈ విందు ఆదివారం సాయంత్రం ఇంగ్లండ్ లోని బ‌ర్మింగ్ హోమ్ లో ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.

58 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన జానీ డెప్(Johnny Depp) భార‌తీయ వంట‌కాలు, కాక్ టెయిల్ ల‌తో మునిగి పోయాడ‌ని పేర్కొంది. ఈ రెస్టారెంట్ లో 400 మంది కూర్చునే సౌల‌భ్యం ఉంది.

వారణాసి రెస్టారెంట్ ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్ మ‌హ్మ‌ద్ హుస్సేన్ వెల్ల‌డించాడ‌ని తెలిపింది.

Also Read : ఎఫ్ 3 మూవీ వ‌సూళ్ల సునామీ

Leave A Reply

Your Email Id will not be published!