KL Rahul : ఇంగ్లాండ్ టూర్ కు కేఎల్ రాహౌల్ డౌట్

హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ చాన్స్

KL Rahul : నెట్ ప్రాక్టీస్ లో గాయప‌డ్డ భార‌త జ‌ట్టు వైఎస్ కెప్టెన్, స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్(KL Rahul)  ఇంకా కోలుకున్న‌ట్టు లేదు. దీంతో గ‌త ఏడాది టెస్టు సీరీస్ లో భాగంగా క‌రోనా సాకుతో ఐపీఎల్ కోసం ఫ్లైట్స్ ఎక్కిన భార‌త జ‌ట్టు మిగిలిన ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్ల‌నుంది.

ఇప్ప‌టికే జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. ఇవాళ రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని జ‌ట్టు ఇంగ్లాండ్ కు వెళ్లాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు రాహుల్ ఇంకా కోలుకోక పోవ‌డంతో ఆడ‌డం అనుమానంగానే ఉంది.

స్వ‌దేశంలో గాయం కార‌ణంగా సౌతాఫ్రికా తో జ‌రుగుతున్న 5 మ్యాచ్ ల టి20 సీరీస్ కు దూరంగా ఉన్నాడు. అత‌డి స్థానంలో ఢిల్లీకి చెందిన రిష‌బ్ పంత్ కు కెప్టెన్సీ ప‌గ్గాలు అప్ప‌గించింది బీసీసీఐ.

ఇంకా జాతీయ క్రికెట్ అకాడ‌మీలోనే ఉండ‌డంతో గాయం నుంచి కోలుకోన‌ట్టేన‌ని అనుమానం. ఇక ఇంగ్లాండ్ టూర్ లో భార‌త జ‌ట్టు మిగిలి పోయిన టెస్టు మ్యాచ్ తో పాటు 3 వ‌న్డే లు, 3 టి20 సీరీస్ లు ఆడాల్సి ఉంది.

ఇక స్వ‌దేశంలో ప‌ర్యాట‌క న్యూజిలాండ్ కు చుక్క‌లు చూపిస్తోంది ఇంగ్లాండ్. ప్ర‌ధానంగా మాజీ కెప్టెన్ జో రూట్ దంచి కొడుతున్నాడు. 10 వేల ర‌న్స్ పూర్తి చేశాడు.

ఇక స‌ఫారీ సీరీస్ ముగిసిన వెంట‌నే పంత్, అయ్య‌ర్ నేరుగా ఇంగ్లాండ్ కు వెళ‌తారు.

ఇక భార‌త టెస్టు జ‌ట్టు ఇలా ఉంది. రోహిత్ శ‌ర్మ (కెప్టెన్ ) , గిల్ , కోహ్లీ, అయ్య‌ర్, విహారి, పుజారా, పంత్ , భ‌ర‌త్ , జ‌డేజా , అశ్విన్ , ఠాకూర్, ష‌మీ, బుమ్రా, సిరాజ్ , ఉమేష్ , ప్ర‌సిద్ద్ కృష్ణ‌.

Also Read : ఎట్ట‌కేల‌కు సంజూ శాంస‌న్ కు చాన్స్

Leave A Reply

Your Email Id will not be published!