Suriya & Kajol : సూర్య‌..కాజోల్ కు అరుదైన అవ‌కాశం

ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో చాన్స్

Suriya & Kajol : ప్ర‌పంచంలోనే ప్ర‌తి న‌టుడు క‌నే క‌ల ఒక్క‌టే. అదేమిటంటే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డు. మ‌రి అలాంటి అవార్డుల ప్ర‌ధానోత్సంలో పాల్గొనాలంటూ ఆహ్వానం ద‌క్కితే.

అది అదృష్టం కాక మ‌రేంటి. జ‌స్ట్ పేరొందిన సినీ రంగానికి చెందిన వారంతా జ‌స్ట్ అందులో పాల్గొంటే చాలు అనుకుంటారు. కానీ భార‌త దేశానికి చెందిన ఇద్ద‌ర న‌టీన‌టుడికి అరుదైన గౌర‌వం ద‌క్కింది.

ఆ చాన్స్ ద‌క్కించుకున్న వారిలో ఒక‌రు కోలీవుడ్ కు చెందిన స‌హ‌జ న‌టుడు సూర్య అయితే , మ‌రొక‌రు బాలీవుడ్ కు చెందిన కాజోల్(Suriya & Kajol)  కు ఆ అదృష్టం వ‌రించింది.

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆర్గ‌నైజింగ్ క‌మిటీ స‌భ్యుడిగా సూర్య‌(Suriya) కు , స‌భ్యురాలిగా కాజోల్(Kajol) కు ద‌క్కింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 397 మంది పేరొందిన వారికి కూడా ఆహ్వానాలు ప్ర‌త్యేకంగా అందాయి.

కాజ‌ల్ తో పాటు సుష్మిత్ ఘోష్ , రింటూ థామ‌స్ , ఇత‌ర క‌ళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన విష‌యాన్ని ఈనెల 28న ఆస్కార్ అవార్డు అకాడ‌మీ బోర్డు వెల్ల‌డించింది.

ఇందుకు సంబంధించి 2022లో 44 శాతం మంది మ‌హిళ‌లు, 37 శాతం ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారిని, 50 శాతం యుఎస్ కు చెందిన వారిని , 53 శాతం దేశాలకు చెందిన వారిని తీసుకుంటున్న‌ట్లు అకాడ‌మీ స్ప‌ష్టం చేసింది.

మ‌రో వైపు సూర్య భిన్న‌మైన క‌థ‌ల్ని సినిమాగా ఎంచుకున్నారు. ఆయ‌న న‌టించిన జై భీమ్ , ఆకాశం నీ హ‌ద్దురా చిత్రాలు గ‌తంలో ఆస్కార్ బ‌రిలో నిలిచాయి. కానీ అవార్డులు గెలుచు కోలేక పోయాయి.

Also Read : గూగుల్ సెర్చింగ్ లో అల్లు అర్జున్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!