Acharya Pramod Krishnam: కాంగ్రెస్ పార్టీపై బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు !

కాంగ్రెస్ పార్టీపై బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు !

Acharya Pramod Krishnam:లోక్‌సభ ఎన్నికల్లో రాయబరేలి నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ ఎన్నుకోవడంపై ఆ పార్టీ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ త్వరలో రాహుల్ గాంధీ వర్గంగా, ప్రియాంక గాంధీ వర్గంగా చీలిపోవచ్చంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుట్రలో ప్రియాంక గాంధీ బలి అయ్యారని కృష్ణం ఆరోపించారు. అమేథీ నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ విడిచిపెట్టిన తీరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నైతకస్థైర్యం దిగజారిందని ప్రమోద్ కృష్ణం అన్నారు. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆమె మద్దతుదారుల్లో ఒక అగ్నిపర్వతంగా రూపుదాల్చి జూన్ 4వ తేదీ తర్వాత బద్ధలవుతుందని చెప్పారు.

Acharya Pramod Krishnam:

రాహుల్ గాంధీకి పాకిస్తాన్‌లో ప్రజాదరణ, డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి రాయ్‌బరేలీకి బదులుగా రావల్పిండి నుంచి పోటీ చేయాలని నేను భావిస్తున్నాను అని ఆచార్య ప్రమోద్ కృష్ణం() అన్నారు. రాహుల్ గాంధీ… ప్రియాంక గాంధీని ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని నేను ముందే చెప్పాను. ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర ఉంది. దీనికి ప్రియాంక గాంధీ బలైపోతోందని మాజీ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం అన్నారు. పార్టీలో జరుగుతున్న ‘కుట్రలో బాధితురాలు ప్రియాంక అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రమోద్ కృష్ణం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.

Also Read :-Vithal Dande: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నిక రద్దు !

Leave A Reply

Your Email Id will not be published!