Assam CM Slams : ప‌వ‌న్ ఖేరాపై అస్సాం సీఎం ఫైర్

అదానీకి మోదీకి ఏం సంబంధం

Assam CM Slams : అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అదానీ హిండెన్ బ‌ర్గ్ వివాదంకు సంబంధించిన వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌వ‌న్ ఖేరా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అదానీకి ప్ర‌ధాని మోదీకి ఏంటి సంబంధం అని ప్ర‌శ్నించారు. అదానీని అడ్డం పెట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని సూచించాడు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే త‌మ పార్టీకి చెందిన నాయ‌కుడు ముఖేష్ శ‌ర్మ ఫిర్యాదు మేర‌కు ప‌వ‌న్ ఖేరాపై యూపీ పోలీసులు కేసు న‌మోదు చేశార‌ని చెప్పారు.

అదానీ హిండెన్ బ‌ర్గ్ వివాదానికి సంబంధించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేరును, ఆయ‌న తండ్రి పేరును అప‌హాస్యం చేసినందుకు ప‌వ‌న్ ఖేరాపై అస్సాం సీఎం తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కాంగ్రెస్ స‌భ్యుల ఈ భ‌యంక‌ర‌మైన కామెంట్స్ ను దేశం క్ష‌మించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వేషం నిత్యం వెళ్ల‌గ‌క్కుతోంది. ప‌దే ప‌దే ప్ర‌ధానిని టార్గెట్ చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు హిమంత బిస్వా శ‌ర్మ‌(Assam CM Slams).

తామే కాదు ప్ర‌జ‌లు కూడా కాంగ్రెస్ పార్టీని క్ష‌మించ‌ద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప‌వ‌ర్ లోకి రార‌ని జోష్యం చెప్పారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఆయ‌నే దేశానికి పీఎంగా ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు మోదీ నాయ‌క‌త్వాన్ని చూసి విస్తు పోతోంద‌న్నారు. ప్ర‌స్తుతం భార‌త దేశం జి20 గ్రూప్ కు సార‌థ్యం వ‌హిస్తోంద‌ని తెలిపారు.

Also Read : అన్ని మ‌తాల ఉమ్మ‌డి శ‌త్రువు ద్వేషం

Leave A Reply

Your Email Id will not be published!