BCCI Golden Ticket : సచిన్ కు గోల్డెన్ టికెట్ – బీసీసీఐ
అందజేసిన కార్యదర్శి జే షా
BCCI Golden Ticket : ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) కార్యదర్శి జే షా గురువారం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలుసుకున్నారు. ఆయనకు బీసీసీఐ తరపున గోల్డెన్ టికెట్ ను అందజేశారు. ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దీనికి ఆతిథ్యం భారత దేశం ఇవ్వనుంది.
BCCI Golden Ticket to Sachin
ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా దిగ్గజ ఆటగాళ్లతో పాటు దేశానికి చెందిన వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను గుర్తించడమే కాదు వారికి టోర్నీకి సంబంధించి గోల్డెన్ టికెట్ ఫర్ ఐకాన్స్ పేరుతో టికెట్లను అందజేస్తూ వస్తోంది.
ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బిగా పేరు పొందిన అమితాబ్ బచ్చన్ కు గోల్డెన్ టికెట్ ను స్వయంగా అందజేశారు బీసీసీఐ కార్యదర్శి జే షా. ఇవాళ ప్రత్యేకించి భారతీయ క్రికెట్ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ కు అందజేసింది.
స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు బీసీసీఐ(BCCI) కార్యదర్శి. ఇక వరల్డ్ కప్ కోసం ఇప్పటికే షెడ్యూల్ ను ఖరారు చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఈ మేరకు భారత జట్టును కూడా ఖరారు చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. మొత్తంగా గోల్డెన్ టికెట్ లు ఇంకా ఎవరెవరికి ఇస్తారనేది ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
Also Read : PM Modi : మీ ప్రేమను మరిచి పోలేను – మోదీ