Bhuma Akhila Priya : ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన అఖిల ప్రియ పై రాళ్ల దాడి

రైతులతో నేరుగా సభ ప్రాంగణానికి వెళ్లేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ వర్గంపై ఎమ్మెల్యే గంగుల నాని సభ్యులు రాళ్లతో దాడి చేశారు

Bhuma Akhila Priya : ఎర్రగుంట్లలో ప్రజలతో సీఎం జగన్‌ భేటీ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు భూమా అఖిల ప్రియ వచ్చారు. అనుమతి లేదని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. బూమా వర్గానికి, పోలీసులకు మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన రైతులపై ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చేయి చేసుకున్నారని భూమా అఖిల ఆరోపించారు.

Bhuma Akhila Priya in YCP Meeting

రైతులతో నేరుగా సభ ప్రాంగణానికి వెళ్లేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ వర్గంపై ఎమ్మెల్యే గంగుల నాని సభ్యులు రాళ్లతో దాడి చేశారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరగడంతో భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేసి సిరివెళ్ల స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. భూమా అఖిలప్రియ పోలీసు వాహనం ఎక్కేందుకు నిరాకరించారు. అఖిల ప్రియ సిరివెళ్లి పోలీస్ స్టేషన్‌కు బయల్దేరి, తాను కాలినడకన వస్తున్నానని బయల్దేరారు.

Also Read : Justice NV Ramana : అమరావతి నిర్మాణానికి రైతులు భూములను త్యాగం చేశారు – మాజీ సీజేఐ

Leave A Reply

Your Email Id will not be published!