Chiranjeevi : రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటి
మర్యాద పూర్వకంగా కలిశాం
Chiranjeevi : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఈ సందర్బంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డిని అభినందించారు. ఇద్దరూ కొద్దిసేపు సినీ రంగానికి సంబంధించి చర్చలు జరిపారు. కేవలం అభినందించేందుకే తాను ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు చిరంజీవి.
Chiranjeevi Met CM Revanth Reddy
మెగాస్టార్ తో పాటు సినీ రంగానికి చెందిన సినీ ప్రముఖులు, టెక్నిషియన్స్ , నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు సీఎంను కలిసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ 10 ఏళ్ల దాకా పాలించింది తెలంగాణ రాష్ట్రాన్ని. ప్రజలు ఊహించని రీతిలో గులాబీ నేతలను ఇంటికి సాగనంపారు.
ఇదిలా ఉండగా సినీ రంగానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని యుద్ద ప్రాతిపదికన పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని ఈ సందర్బంగా చిరంజీవితో స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ఎవరైనా తనతో కలవ వచ్చని సూచించారు.
Also Read : Congress Promises : విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు