CM YS Jagan : సీఎం జగన్‌ పై రాయితో దాడి ! కంటికి స్వల్ప గాయం !

సీఎం జగన్‌ పై రాయితో దాడి ! కంటికి స్వల్ప గాయం !

CM YS Jagan: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌ పై పూలతో పాటు ఓ రాయిని కూడా విసిరినట్లు తెలుస్తోంది. బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ ముఖాన్ని తాకడంతో… కనుబొమ్మ సమీపంలో గాయమయింది.

CM YS Jagan Attack

సీఎం జగన్‌పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్‌ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్‌ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. వెంటనే సీఎం జగన్‌ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్‌. విజయవాడలో సీఎం జగన్‌ కోసం జనం పోటెత్తారు. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా సీఎం జగన్‌(CM YS Jagan) బస్సుయాత్ర అప్రతిహతంగా భారీ రోడ్‌ షో కొనసాగుతోంది. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

విజయవాడలో సీఎం వైయస్ జగన్‌ పై గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు’’ అంటూ వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Also Read : Atchannaidu TDP : వైసీపీపై నిప్పులు చెరిగిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు

Leave A Reply

Your Email Id will not be published!