CM YS Jagan: ప్రముఖ ఆన్లైన్‌ కోర్సుల సంస్ధ ఎడెక్స్‌ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం !

ప్రముఖ ఆన్లైన్‌ కోర్సుల సంస్ధ ఎడెక్స్‌ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం !

CM YS Jagan: ప్రపంచస్ధాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ–లెర్నింగ్‌ ప్లాట్ ఫాం ఎడెక్స్‌ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ ఎడెక్స్ సంస్థ ద్వారా అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించడానికి ఈ ఒప్పందం జరిగింది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan) సమక్షంలో క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ–లెర్నింగ్‌ ప్లాట్ఫామ్‌ ఎడెక్స్‌ ల మధ్య ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ప్రాధమిక విద్యాశాఖ కమిషనర్‌ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, ఎడెక్స్‌ వ్యవస్ధాపకులు ప్రొఫెసర్‌ అనంత అగర్వాల్, ఎడెక్స్‌ ఇతర ప్రతినిధులు, విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్‌ లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లె­ర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు ఈ కార్యక్రమం ద్వారా సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో ఉద్యోగాలను సాధించేలా ఈ కార్యక్రమం విద్యార్ధులకు ఉపయోగపడుతుంది.

CM YS Jagan – ‘ఎడెక్స్‌’ ఒప్పందంతో 12 లక్షల మందికి లబ్ధి !

ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌(AP) లోని సుమారు 12 లక్షల మంది విద్యార్థులు వరల్డ్‌ క్లాస్‌ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ కోర్సులను, రెగ్యులర్‌ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారు. ఇక్కడ ప్రపంచంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. ప్రపంచంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్‌ పెట్టడం ద్వారా విద్యార్థి నచ్చిన వర్టికల్స్‌ చదువుకునేలా ప్రణాళిక రూపొందించింది. విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. తద్వారా ఏపీ విద్యార్థులు గ్లోబల్‌ స్టూడెంట్స్‌గా ఎదుగుతారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్‌ ఓరియెంటెడ్‌ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో ఎడెక్స్‌ ఎంతో ఉపయోగపడనుంది.

Also Read : Nara Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజ శ్యామల యాగం !

Leave A Reply

Your Email Id will not be published!