Congress PM Modi : వేషం మార్చినా నీడ అలాగే ఉంది

నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ

Congress PM Modi : దేశంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీని, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని నిత్యం టార్గెట్ చేస్తూ వ‌స్తోంది ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ. ప్ర‌ధానంగా రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతున్నారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డంలో, న‌మ్మించ‌డంలో పీఎం ఆరి తేరారంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. అంతే కాదు సీరియ‌స్ కామెంట్స్ కూడా చేశారు.

ఆయ‌న చేసిన మోదీ కామెంట్స్ పై 2019కు సంబంధించి ప‌రువు న‌ష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి ఏకంగా 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇటీవ‌లే రాహుల్ కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది.

తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై సెటైర్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆదివారం క‌ర్ణాట‌క లోని బందీపూర్ టైగ‌ర్ ప్రాజెక్టును సంద‌ర్శించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటై 50 ఏళ్లు పూర్త‌వుతోంది. ఈ సంద‌ర్బంగా మోదీ ఇవాళ ఉద‌యం అక్క‌డికి చేరుకున్నారు. పూర్తిగా ఆయ‌న వేషం మార్చారు. టోపీ ధ‌రించారు. జంగిల్ స‌ఫారీకి బ‌య‌లు దేరి వెళ్లారు.

దాదాపు ఇది ప్రాజెక్టులో 20 కిలోమీట‌ర్ల మేర ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఆయ‌న జేమ్స్ బాండ్ త‌ర‌హాలో క‌నిపించారు. దీనిపై ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసింది. ఫోటోతో పాటు నీడ కూడా ఉన్న దానిని షేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందుకు క్యాప్ష‌న్ కూడా జ‌త చేసింది. మారు వేషం మార్చినా నీడ అలాగే ఉంద‌ని పేర్కొంది.

Also Read : ఇంకేం ఉంది దోచుకునేందుకు

Leave A Reply

Your Email Id will not be published!