C Vigil: సీ-విజిల్‌ ఫిర్యాదు బహిర్గతం చేసినందుకు ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్‌ !

సీ-విజిల్‌ ఫిర్యాదు బహిర్గతం చేసినందుకు ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్‌ !

C Vigil: ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ) ను ఉల్లంఘించిన వారిపై ఎన్నికల కమీషన్ కొరడా ఝులిపిస్తోంది. అదే సమయంలో సీ-విజిల్‌(C Vigil) యాప్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైసీపీ నాయకులకు సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. దీనితో ఫిర్యాదును బహిర్గతం చేసిన ఇద్దరు ఉద్యోగులపై ఎన్నికల కమీషన్ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామ సచివాలయం-1 పంచాయతీ కార్యదర్శి బి.వి.రవిచంద్ర, ఉంగుటూరు తహసీల్దార్‌ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ అమృతను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఉంగుటూరు ఎంపీడీవో శర్మకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

C Vigil – అసలేం జరిగిందంటే ?

ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో గ్రంథాలయం, వాటర్‌ ప్లాంటుకు వైసీపీ రంగులు ఉండటంతో స్థానికుడు ఫొటోలు తీసి సీ-విజిల్‌ యాప్‌లో ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోల్లో ఫిర్యాదుదారుడితో పాటు ఆయన స్నేహితుడు కూడా ఉన్నారు. గంటలోపే అధికారులు స్పందించి వాటికి తెల్లరంగు వేయించారు. అయితే ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్నా… స్థానిక అధికారులు మాత్రం ఫిర్యాదు చేసినవారి వివరాలు తెలిసేలా ల్యాప్‌ టాప్‌ లో స్క్రీన్‌షాట్‌ తీశారు. దాన్ని వైసీపీ నాయకులకు పంపించారు. దీనితో ఫిర్యాదుదారుడి స్నేహితుడి సోదరుడికి వైసీపీ నాయకులు ఫోన్‌ చేసి ప్రశ్నించారు. ఈ విషయం ఫిర్యాదుదారుడికి తెలియడంతో సీ-విజిల్‌ యాప్‌ లో బుధవారం మరోసారి ఫిర్యాదు చేశారు.

Also Read : AP CEO Mukesh Kumar : ఆ మూడు జిల్లాల ఎస్పీలపై ఎన్నికల సీఈఓ ముఖేష్ కుమార్ గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!