MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సంచలన ప్రకటన !

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సంచలన ప్రకటన !

MLC Kavitha: తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా… ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది.

MLC Kavitha Liquor Scam Case Updates

‘‘ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు. ఆప్‌ నేతలతో కలిసి కవిత(MLC Kavitha) అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియాతో కలిసి ఈమె అవినీతికి పాల్పడ్డారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. హోల్‌సేల్‌ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారు. ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌తోపాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ. 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం’’ అని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఒక నేరాభియోగపత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపిన ఈడీ… ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

Also Read : Rohini Acharya: బీహార్ రాజకీయాల్లోకి మాజీ సీఎం కుమార్తె ?

Leave A Reply

Your Email Id will not be published!