Harbhajan Singh : శాంసన్ కంటే సూర్య బెటర్
మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్
Harbhajan Singh : భారత్ లో త్వరలో నిర్వహించ బోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. స్టార్ క్రికెటర్ , రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
Harbhajan Singh Comments Viral
వన్డే ఫార్మాట్ లో అత్యంత ప్రతిభా సామర్థ్యం కలిగి ఉన్న కేరళ స్టార్ ను కావాలని ఎంపిక చేయలేదంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరో వైపు క్రికెట్ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేశాయి.
మిడిల్ ఆర్డర్ లో ముంబైకి చెందిన సూర్య కుమార్ యాదవ్ ను ఎంపిక చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ తరుణంలో భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) స్పందించాడు. ఆయన జాతీయ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడాడు.
సంజూ శాంసన్ కంటే సూర్య కుమార్ యాదవ్ బెటర్ అంటూ కితాబు ఇచ్చాడు. ఇది వరల్డ్ కప్ కోసం ఆడుతున్న జట్టులా లేదని కేవలం ముంబై లాబీయింగ్ జట్టు అంటూ పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు ఫ్యాన్స్.
కాగా మిడిల్ ఆర్డర్ లో సంజూ శాంసన్ కంటే సూర్య కుమార్ యాదవ్ బాగా ఆడతాడని , కేవలం 30 బంతులు ఉంటే చాలని దుమ్ము రేపడం ఖాయమని వెనకేసుకు వచ్చాడు భజ్జీ. సింగ్ చేసిన కామెంట్స్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read : Sanatana Dharma Comment : సనాతన ధర్మం వివాదం