Ambati Rambabu: మాజీ మంత్రి అంబటికి హైకోర్టు షాక్ ! 

మాజీ మంత్రి అంబటికి హైకోర్టు షాక్ ! 

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తున్న సత్తెనపల్లి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్న చంద్రగిరి నియోజకవర్గాల్లో రీపోలింగ్‌ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైసీపీ అభ్యర్థి మోహిత్‌ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. పోలింగ్‌ రోజు హింసాత్మక ఘటనల నేపథ్యంలో సత్తెనపల్లిలోని నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని మంత్రి అంబటి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

Ambati Rambabu….

మరో వైపు తిరుపతి జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్‌ నిర్వహించాలని మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. చంద్రగిరిలో స్క్రూటినీ రీ షెడ్యూల్ చేయాలని, రీ పోలింగ్ నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ ను కూడా హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.

Also Read : Rama Krishna Reddy Pinnelli: పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ !

Leave A Reply

Your Email Id will not be published!