Shashi Tharoor : డాక్ట‌రేట్ అందుకున్న శ‌శి థ‌రూర్

ప్ర‌పంచం స‌వాళ్ల‌ను ఎదుర్కోంటోంది

Shashi Tharoor : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ అరుదైన ఘ‌న‌త సాధించారు. ఆయ‌న గుడ్ పార్ల‌మెంటేరియ‌న్ తో పాటు మంచి వ‌క్త‌, అంత‌కు మించిన అద్భుత‌మైన ర‌చ‌యిత‌. ఇప్ప‌టికే గుర్తింపు పొందిన శ‌శి థ‌రూర్ కు ప్ర‌తిష్టాత్మ‌కమైన అంత‌ర్జాతీయ సంస్థ నుంచి డాక్ట‌రేట్ ద‌క్కింది. జెనీవా స్కూల్ ఆఫ్ డిప్లొమసీ నుండి దీనిని అందుకున్నారు శ‌శి థ‌రూర్. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను శ‌నివారం చేశారు కాంగ్రెస్ ఎంపీ.

డాక్ట‌రేట్ అందుకున్నందుకు ఆనందంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో శ‌శి థ‌రూర్ మాట్లాడారు. ఇవాళ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప్ర‌పంచం పెను స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మ‌నంద‌రికీ కష్ట కాలం. ఇంత‌కంటే ఎక్కువ‌గా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాం. కానీ మాన‌వ మ‌నుగ‌డకే ప్ర‌శ్నార్థ‌కంగా మారాలే చేసింది క‌రోనా అని పేర్కొన్నారు. దీనిని అధిగమించేందుకు చేసిన ప్ర‌యత్నం అభినంద‌నీయ‌మ‌న్నారు.

కోవిడ్ తో పాటు ఆర్థిక మాంద్యం కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని చెప్పారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor). ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దాన్ని విర‌మించ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ మాన‌వాళి మొత్తం శాంతిని కోరుకుంటోంద‌న్నారు. కానీ ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల చీఫ్ లు ర‌క్త దాహాన్ని ఆప‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : PM Modi Chant : అమెరికాలో మోదీ నామ స్మ‌ర‌ణ‌

 

Leave A Reply

Your Email Id will not be published!