KCR: సోషల్‌ మీడియాలోకి కేసీఆర్‌ ఎంట్రీ !

సోషల్‌ మీడియాలోకి కేసీఆర్‌ ఎంట్రీ !

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌ లో అకౌంట్‌ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ కు ఉద్య‌మ కాలం నాటి త‌న ఫొటోను కేసీఆర్ జ‌త చేశారు.

KCR Enters in..

బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్టి.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్‌షోలు నిర్వ‌హిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాల‌తో పాటు రాజ‌కీయాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు.

Also Read : Jagdeep Dhankhar: భారత్‌ బయోటెక్‌ ను సందర్శించిన ఉప రాష్ట్రపతి !

Leave A Reply

Your Email Id will not be published!