Vijaya Sai Reddy Tarakaratna : తార‌క‌ర‌త్న ఆరోగ్యం ప‌దిలం

ఎంపీ విజ‌య సాయి రెడ్డి

Vijaya Sai Reddy Tarakaratna : వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి న‌టుడు తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితిపై స్పందించారు. ఆయ‌న ఆరోగ్యం ప్ర‌స్తుతానికి ప‌దిలంగా ఉంద‌ని తెలిపారు. మెద‌డు కొంచెం దెబ్బ‌తింద‌ని నంద‌మూరి బాల‌కృష్ణ ద‌గ్గ‌రుండి అన్నీ చూసుకుంటున్నార‌ని చెప్పారు. నారా లోకేష్ ప్రారంభించిన యుగ గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. కుప్పంలో చేర్చారు. అక్క‌డి నుంచి బెంగ‌ళూరు లోని హృద‌యాల‌య ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ విజ‌య సాయి రెడ్డి భార్య స్వంత చెల్లెలు కూతురు అలేఖ్య రెడ్డిని తార‌క‌రత్న పెళ్లి చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆస్ప‌త్రిలో ఉన్న న‌టుడిని ప‌రామ‌ర్శించారు.

బాల‌కృష్ణ‌తో సంభాషించారు. ద‌గ్గ‌రుండి ఆయ‌నే చూసుకుంటున్నార‌ని చెప్పారు. కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చె్పారు. గుండె పోటు వ‌చ్చిన రోజు 45 నిమిషాలు ర‌క్త ప్ర‌స‌ర‌ణ ఆగిపోవ‌డం వ‌ల్ల మెద‌డులో కొంత భాగం దెబ్బ తింద‌ని తెలిపారు. వైద్యులు మెరుగైన చికిత్స అంద‌జేస్తున్న‌ట్లు చెప్పారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి(Vijaya Sai Reddy).

ప్ర‌స్తుతం మెద‌డులోకి నీరు చేరి దెబ్బ‌తిన్న‌ద‌ని పేర్కొన్నారు. వాపు త‌గ్గిన వెంట‌నే బ్రెయిన్ రిక‌వ‌రీ అవుతుంద‌ని వైద్యులు తెలిపిన‌ట్లు తెలిపారు. తాను ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు బాల‌కృష్ణ‌కు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు. తార‌క‌ర‌త్న త్వ‌ర‌లోనే కోలుకుంటారన్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు విజ‌య సాయి రెడ్డి.

ఇదిలా ఉండ‌గా విజ‌య సాయి రెడ్డికి(Vijaya Sai Reddy) వ‌రుస‌కు న‌టుడు తార‌క‌ర‌త్న అల్లుడు అవుతాడు. ఇక తార‌క్ భార్య క్యాస్టూమ్ డిజైన‌ర్ గా ప‌ని చేశారు. వీరిది ప్రేమ వివాహం.

Also Read : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!