Nagarjuna Sister : నాగార్జున సోదరి నాగసుశీల దాదాగిరీ

నాగ సుశీల‌, సుశాంత్ మ‌రో 10 మందిపై కేసు

Nagarjuna Sister : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున సోద‌రి నాగ సుశీల చిక్కుల్లో ప‌డ్డారు. ఆమెపై తీవ్ర‌మైన అభియోగాలు ఉన్నాయి. శ్రీ‌జ ధ‌ర్మ పీఠం ఆశ్ర‌మంపై నాగ సుశీల, త‌న అనుచ‌రుల‌తో క‌లిసి దాడికి పాల్ప‌డ్డారని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Nagarjuna Sister Viral

ఈ ఘ‌ట‌న సెప్టెంబ‌ర్ 12న చోటు చేసుకుంద‌ని తెలిపారు. నాగార్జునను అడ్డం పెట్టుకుని నాగ సుశీల దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. నాగ సుశీల‌తో పాటు మ‌రికొంద‌రు వ‌చ్చార‌ని శ్రీ‌జ ధ‌ర్మ పీఠంకు చెందిన శ్రీ‌నివాస‌రావు ఇంటిపై దాడికి పాల్ప‌డ్డార‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా నాగ సుశీల‌తో ప‌లు చిత్రాలు నిర్మించారు చింత‌ల‌పూడి శ్రీ‌నివాస‌రావు. వీరిద్ద‌రి మ‌ధ్య భూ వివాదం నెల‌కొంది. దీంతో శ్రీ‌నివాస‌రావు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరారు. మొయినాబాద్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశారు పోలీసులు.

నాగ సుశీల‌, న‌టుడు సుశాంత్(Sushanth) తో పాటు మ‌రో 10 మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. చింత‌ల‌పూడి శ్రీ‌నివ‌స‌రావు ట్ర‌స్టుకు ఇచ్చిన భూముల‌కు సంబంధించిన‌ది కావ‌డంతో ఇది తెర‌పైకి వ‌చ్చింది. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read : Canada Expells : భార‌త దౌత్య‌వేత్త బ‌హిష్క‌ర‌ణ – కెన‌డా

Leave A Reply

Your Email Id will not be published!