Nallimilli Rama Krishna Reddy: బీజేపీలో చేరిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి !

బీజేపీలో చేరిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి !

Nallimilli Rama Krishna Reddy: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, సిద్దార్థనాథ్‌సింగ్‌, అరుణ్‌సింగ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన అనపర్తి నుంచి కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు.

Nallimilli Rama Krishna Reddy Joined in BJP

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకు కేటాయించారు. దీనితో అనపర్తి బీజేపీ అభ్యర్ధిగా శివరామకృష్ణం రాజును అధిష్టానం ప్రకటించింది. దీనితో టీడీపీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అనుచరుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అదే సమయంలో తనకు టికెట్‌ కేటాయించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో గత కొన్ని రోజులుగా ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును బీజేపీ తీసుకునే అవకాశముందని ప్రచారం జరిగింది. కానీ, సమీకరణలు కుదరక పోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయించారు.

Also Read : YS Sharmila : పీఎం మోదీ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!