Nikhil Siddhartha: టీడీపీలో చేరిన టాలీవుడ్ ప్రముఖ హీరో నిఖిల్ !

టీడీపీలో చేరిన టాలీవుడ్ ప్రముఖ హీరో నిఖిల్ !

Nikhil Siddhartha: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. రాజకీయ నాయకులతో పాటు సినీ హీరోలు కూడా వివిధ పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ హీరో నిఖిల్ సిద్ధార్ధ(Nikhil Siddhartha) యాదవ్ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… నిఖిల్ కు కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది. నిఖిల్ మామయ్య మద్దులూరి మాలకొండయ్య యాదవ్ బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరుఫున ప్రచారం చేసే అవకాశం ఉంది.

Nikhil Siddhartha Joined in TDP

2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరుఫున గెలుపొందిన కరణం బలరాం ఆ తర్వాత వైసీపీలో చేరారు. దీంతో చీరాల ఇంఛార్జిగా మాలకొండయ్యకు టీడీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది. చీరాల అసెంబ్లీ సెగ్మెంట్లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా మాలకొండయ్యకు చంద్రబాబు అవకాశం కల్పించారు. అటు వైసీపీ కరణం బలరాంకు బదులుగా ఆయన తనయుడు కరణం వెంకటేశ్‌కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. మామ తరుఫున నిఖిల్ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్‌ గతేడాది ‘స్పై’ సినిమా విడుదల కాగా ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో సంయుక్త మీనన్‌ జోడీగా నిఖిల్‌ ‘స్వయంభు’ సినిమా చేస్తుండగా… చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తీకేయ 3’ కూడా చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో కొన్ని రోజుల కిందట నిఖిల్‌ తండ్రైన విషయం కూడా తెలిసిందే.

Also Read : Thatikonda Rajaiah: మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి తాటికొండ రాజయ్య ! కడియంకు చెక్‌ పెట్టేందుకేనా !

Leave A Reply

Your Email Id will not be published!