Revanth Reddy : ఖాకీల‌తో స‌ర్కార్ న‌డుపుతున్న కేసీఆర్

అమ‌రుల స్థూపం నిర్మాణంలో అవినీతి

Revanth Reddy : రాష్ట్రంలో ఖాకీల పాల‌న సాగుతోంద‌న్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వాళ్ల‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రెచ్చి పోతున్నాడ‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర సాధ‌నంలో 1500 మందికి పైగా అమ‌రుల‌య్యార‌ని, వారి పేరుతో నిర్మించిన స్థూపం నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంద‌ని ఆరోపించారు. తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాల పేరుతో ప్ర‌జా ధ‌నాన్ని లూటీ చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. గురువారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

హ‌జ్ కు వెళ్లే యాత్రీకుల‌ను క‌లిసేందుకు వెళ్లిన మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీని ఎలా అడ్డుకుంటారంటూ ప్ర‌శ్నించారు. ఇక అమ‌ర వీరుల స్థూపం నిర్మాణం అంచ‌నా రూ. 66 కోట్లు ఉండ‌గా దానిని రూ. 155 కోట్ల‌కు ఎలా పెంచారంటూ నిల‌దీశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ స్థూపం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుంద‌ని, దీనిపై తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక విచార‌ణ చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. అమ‌ర వీరుల‌ను అవ‌మానించేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కేటీఆర్ ఫ్రెండ్ శ్రీ‌ధ‌ర్ కు ద‌గ్గ‌రి వ్య‌క్తి అయిన కామిశెట్టి ఈ టెండ‌ర్ ను ద‌క్కించు కున్నార‌ని ఆరోపించారు రేవంత్ రెడ్డి. తొమ్మిదేళ్ల‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్ పూర్త‌యింది. సెక్రెటేరియ‌ట్ క‌ట్టారు. కానీ అమ‌ర వీరుల స్థూపం క‌ట్టేందుకు ఇంత ఆల‌స్యం ఎందుకు అయ్యిందో చెప్పాల‌న్నారు. ఆంధ్రా వాళ్ల‌కు ఎలా అప్ప‌గిస్తారంటూ నిల‌దీశారు. తాము అధికారంలోకి వ‌చ్చాక అమ‌ర వీరుల కుటుంబాల‌ను గుర్తిస్తామ‌ని, వారికి నెల నెలా 25 వేల పెన్ష‌న్ ఇస్తామ‌న్నారు.

Also Read : TSPSC GROUP-4 : గ్రూప్ -4 ప‌రీక్ష‌కు వేళాయె

Leave A Reply

Your Email Id will not be published!