Samatha Kumbh 2023 : దివ్య సాకేతం..పుష్పయాగం..ధ్వజారోహణం
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి
Samatha Kumbh 2023 : సమతా కుంభ్ 2023 ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శంషాబాద్ ముచ్చింతల్ లోని దివ్య సాకేతం క్షేత్రంలో. జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 2 నుంచి ఉత్సవాలు(Samatha Kumbh 2023) ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని నలుమూలలు, విదేశాల నుంచి భక్త బాంధవులు పెద్ద ఎత్తున ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
లోక కళ్యాణం కోసం, విశ్వంలోని సమస్త మానవులంతా బాగుండాలని, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుతూ సమతా కుంభ్ 2023 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి. సమతా స్పూర్తి కేంద్రంలో శనివారం రథోత్సవం, నిత్య పూర్ణ హారతిని ఘనంగా నిర్వహించారు.
అనంతరం చక్ర స్నానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఫిబ్రవరి 12న ఆదివారం సాకేత రామచంద్ర ప్రభువుకు దివ్య సాకేతంలో పూజలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.00 గంటలకు పుష్ప యాగం , దేవతా ధ్యానవనం, మహా పూర్ణ హారతి, ధ్వజారోహణం ఉంటుంది. తీర్థ ప్రసాద వితరణ చేపడతారు.
ఇదిలా ఉండగా భక్త జన బాంధవులకు దివ్య సాకేత క్షేత్రంలో జరిగే సాకేత కుంభ్ 2023 ఉత్సవాలలో కైంకర్యాలు నిర్వహించే భాగ్యాన్ని జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు మహత్ భాగ్యాన్ని కల్పించారు. స్వామి వారి దివ్య ఆశీస్సుల కోసం భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ప్రతి రోజూ తీర్థ గోష్టి, ప్రసాద వితరణ కొనసాగుతోంది.
Also Read : శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు షురూ