TDP Mission Rayalaseema : మిషన్ రాయలసీమపై ఫోకస్
ప్రకటించిన తెలుగుదేశం పార్టీ
TDP Mission Rayalaseema : తెలుగుదేశం పార్టీ(TDP) ఏపీలో అధికారంలోకి రావడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటిస్తూ , సభలలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ చీఫ్ , సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఈ తరుణంలో ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
మరో వైపు తన తనయుడు , పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాద యాత్రకు శ్రీకారం చుట్టారు ఏపీలో. ఆయన యాత్ర నేటితో 120 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రాయలసీమలో కొనసాగుతోంది. పాద యాత్రకు భారీగా జనం ఆదరిస్తున్నారు. దీంతో మరింత జోష్ పెంచారు నారా లోకేష్.
ఇందులో భాగంగా కడపలో మిషన్ రాయలసీమపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. తన విజన్ ను ప్రకటించారు. తాము గనుక ఏపీలో అధికారంలోకి వస్తే రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు లోకేష్. ఈ సందర్బంగా మిషన రాయలసీమను ప్రకటించారు.
చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్స్ కు కేంద్రంగా , అనంతపురం జిల్లాను ఆటోమొబైల్ హబ్ గా, కర్నూల్ జిల్లాను వ్యవసాయ పరికరాల తయారీగా , ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామన్నారు . కడప జిల్లాను క్రీడల హబ్ గా మారుస్తామని చెప్పారు.
Also Read : RBI Governor : రుణగ్రహీతలకు ఆర్బీఐ ఊరట