YS Sharmila: సీఎం జగన్ పై దాడిని ఖండించిన షర్మిల !

సీఎం జగన్ పై దాడిని ఖండించిన షర్మిల !

YS Sharmila: మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్ నగర్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila) తీవ్రంగా ఖండించారు. కడప జిల్లాలో ఎన్నిలక ప్రచారంలో పాల్గొన్న ఆమె ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి… ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఆమె తెలిపారు.

YS Sharmila Comment

ఇది ఇలా ఉండగా సీఎం జగన్ పై జరిగిన దాడి… టీడీపీ రౌడీ మూకల దాడి అంటూ వైసీపీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాధరణ తట్టుకోలేక పచ్చ పార్టీ రౌడీ మూకలు ఈ దాడికి పాల్పడ్డాయంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే సానుభూతి కోసం సీఎం జగన్, వైసీపీ ఆడుతున్న మరో కోడి కత్తి డ్రామా అంటూ టీడీపీ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది.

Also Read : Janasena: జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాక్ !

Leave A Reply

Your Email Id will not be published!