Shashi Tharoor : కేంద్ర స‌ర్కార్ పై శ‌శి థ‌రూర్ సెటైర్

ప‌నీర్..వెన్న‌..బ‌సాలాపై జీఎస్టీ

Shashi Tharoor : కేంద్ర స‌ర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇదే అంశంపై కేర‌ళ ప్ర‌భుత్వం తాము అమ‌లు చేయ‌బోమంటూ స్ప‌ష్టం చేసింది.

ఒక ర‌కంగా కేంద్ర ప్ర‌భుత్వానికి షాక్. ఈ త‌రుణంలో శ‌శి థ‌రూర్ (Shashi Tharoor) ఆస‌క్తిక‌రమైన అంశాన్ని లేవ‌దీశారు. అదేమిటంటే ప‌నీర్ ..వెన్న‌..మ‌సాలా పై కూడా జీఎస్టీని లెక్కించ‌డంటూ ఎద్దేవా చేశాడు శ‌శి థ‌రూర్.

ప‌నీర్ పై జీఎస్టీ 5 శాతం..వెన్న‌పై జీఎస్టీ 12 శాతం..మ‌సాలా పై జీఎస్టీ 5 శాతం భ‌లే బాగుంద‌న్నారు. ప‌నీర్ బ‌ట‌ర్ మ‌సాలాపై జీఎస్టీని లెక్కించండి ఇంకెందుకు ఆల‌స్యం అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ , ప్ర‌ధాన మంత్రి మోదీని ప్ర‌శ్నించారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేస్తుందో అర్థం కావ‌డం లేద‌న్నారు శ‌శి థ‌రూర్. వ‌స్తు సేవ‌ల ప‌న్ను పేరుతో మీరు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేద‌ని పేర్కొన్నారు. ప‌నీర్ బ‌ట‌ర్ మ‌సాలా ధ‌ర‌లు కూడా పెరుగుతాయా అని నిల‌దీశారు శ‌శి థ‌రూర్.

ముందుగా ప్యాక్ చేసిన ఆహార ప‌దార్థాల‌ను ప‌న్ను విధానంలోకి తీసుకు రావడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది అత్యంత ప‌నికిమాలిన చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఈ అద్భుత‌మైన వాట్సాప్ ఫార్వ‌ర్డ్ ల‌తో ఎవ‌రు ముందుకు వ‌స్తారో నాకు తెలియ‌దు. ఇది ఒక ర‌కంగా జోక్ అనిపిస్తోంద‌న్నారు శ‌శి థ‌రూర్.

ఇదిలా ఉండ‌గా శ‌శి థ‌రూర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

Also Read : ఎన్సీపీలో అన్ని విభాగాలు ర‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!