Sunil Bharti Mittal : కేంద్ర టెలికాం విధానం అద్భుతం – మిట్ట‌ల్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై కామెంట్స్

Sunil Bharti Mittal : ప్ర‌ముఖ భార‌తీయ టెలికాం వ్యాపార దిగ్గ‌జం సునీల్ భార‌తీ మిట్ట‌ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానాన్ని ప్ర‌శంసించారు.

ఇలాంటి విధానం గ‌తంలో అమ‌లు కాలేద‌న్నారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ ప‌రంగా ఏ బిడ్ లో పాల్గొనాల‌న్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యేవ‌ని కానీ ఈసారి జ‌రిగిన బిడ్ లో అలాంటి ప‌రిస్థితి ఎదురు కాలేద‌ని పేర్కొన్నారు.

ఇండియాస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై త‌న అభిప్రాయం క‌రెక్టేన‌ని తేలింద‌న్నారు సునీల్ భార‌తీ మిట్ట‌ల్. ఎవ‌రికీ స‌లాం కొట్టాల్సిన అవ‌స‌రం లేదు.

నో ఫాలో అప్ . కారిడార్ల చుట్టూ ప‌రిగెత్త‌డం చూడ లేద‌ని పేర్కొన్నారు భార‌తీ ఎయిర్ టెల్ చైర్మ‌న్. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స్పెక్ట్ర‌మ్ లో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండానే క్లీన్ గా పూర్త‌యింద‌న్నారు.

ఇలాంటి విధానాన్ని అమ‌లు చేసినందుకు కేంద్ర స‌ర్కార్ ను తాను ప్ర‌శంసిస్తున్న‌ట్లు చెప్పారు సునీల్ భార‌త్ మిట్ట‌ల్(Sunil Bharti Mittal). బ‌కాయిలు చెల్లించిన కొద్ది గంట‌ల్లోనే 5జీ స్పెక్ట్ర‌మ్ ను కేటాయించేందుకు కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న చురుకైన విధానాన్ని ఎయిర్ టెల్ ఫౌండ‌ర్ , చైర్మ‌న్ మిట్ట‌ల్ కితాబు ఇవ్వ‌డం విశేషం.

ఇలాంటి విధానం వ‌ల్ల వ్యాపారం చేసే వారికి మ‌రింత ఉత్సాహాన్ని ఇస్తుంద‌న్నారు. టెలికాం డిపార్ట్ మెంట్ తో త‌న 30 ఏళ్ల ప్ర‌త్య‌క్ష అనుభ‌వంలో ఇది మొద‌టిద‌ని పేర్కొన్నారు.

టెలికాంలో కీల‌క మార్పులు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు సునీల్ భార‌తీ మిట్ట‌ల్.

Also Read : జమ్మూ కాశ్మీర్ లో స్థానికేత‌రుల‌కు ఓటు

Leave A Reply

Your Email Id will not be published!