Mahua Moitra : రేపిస్టుల విడుదల సిగ్గు చేటు – మహూవా
బిల్కిస్ బానో మహిళనా లేక ముస్లిమా తేల్చండి
Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో ను రేప్ చేసి, కూతురిని , 11 మందిని హత్య చేసిన కేసులో దోషులను బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఆపై రేప్ కు , హత్యకు పాల్పడిన వారు స్వీట్లు పంచుకున్నారు. కానీ బాధితురాలు మాత్రం మౌనంగా ఉంది. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది. నారీ శక్తి గురించి ప్రధాని మోదీ గొప్పగా మాట్లాడారు.
నారీ శక్తి, మహిళా సాధికారత, భద్రత అంటే ఇదేనా. అత్యాచారానికి పాల్పడిన వారిని బయటకు విడుదల చేయడం అంటే సమాజానికి, దేశానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారంటూ ప్రశ్నించింది ఎంపీ మహూవా మోయిత్రా(Mahua Moitra).
సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరి తీయాల్సింది పోయి వారికి రక్షణ గా నిలవడం దారుణమన్నారు. దీనిని చూసి సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకుంటోందన్నారు ఎంపీ.
రేపిస్టులను విడుదల చేయడాన్ని ఏ సమాజమూ ఒప్పుకోదన్నారు. అసలు బీజేపీ సర్కార్ పూర్తిగా తప్పు చేసిందని మండిపడ్డారు ఎంపీ.
రోజు రోజుకు దేశంలో మహిళలు బతకాలంటే భయపడాల్సిన స్థితికి మోదీ సర్కార్ తీసుకు వచ్చేలా చేస్తోందంటూ ఆరోపించారు మహూవా మోయిత్రా. రేప్ , హత్యలకు పాల్పడిన వారిలో మార్పు ఎలా వస్తుందని ఆశిస్తారంటూ ప్రశ్నించారు.
బిల్కిస్ బానో మహిళనా లేదా ముస్లిమా అని ఈ దేశం నిర్ణయించడం మంచిదన్నారు. ఈ ఘటన పూర్తిగా మహిళలకు వ్యతిరేకమైనదిగా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : భరత మాతా మన్నించవమ్మా