Munawar Faruqui Show : ఉద్రిక్తత మధ్య మునావర్ ఫారూఖీ షో
శిల్పకళా రామం వద్ద టెన్షన్ టెన్షన్
Munawar Faruqui Show : దేశ వ్యాప్తంగా పేరొందిన స్టాండ్ అప్ కమెడియన్ గా పేరొందిన మునావర్ ఫరూఖీ షో హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇప్పటికే బెంగళూరులో ఏర్పాటు చేయ తలపెట్టిన కామెడీ షో రద్దు అయ్యింది.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ హిందువుల మనో భావాలను దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నాడంటూ ఆరోపించారు. ఆయనతో పాటు హిందూ సంస్థలు కూడా కన్నెర్ర చేశాయి.
ఇదిలా ఉండగా స్టార్ కమెడియన్ మునావర్ ఫరూఖీ కామెడీ షో(Munawar Faruqui Show) కు తెలంగాణ ప్రభుత్వం బేషరతుగా అనుమతి ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున షో జరుగుతున్న వేదికకు చేరుకున్నారు.
ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను మునావర్ ఫరూఖీకి ఓ గంట ముందే ప్రారంభించేందుకు పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర పోలీస్ శాఖ. దీనిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే రాజా సింగ్. శిల్ప కళా వేదికలో సాయంత్రం ప్రారంభమైంది.
దీంతో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వేదిక వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఇప్పటి వరకు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
వీరందరిని గచ్చిబౌలి స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా మునావర్ ఫరూఖీ కామెడీ షో కోసం 2 , 100 మందికి పైగా టికెట్లు బుక్ చేసుకున్నారు. కాగా ఈ కామెడీ షో రాత్రి వరకు కొనసాగనుంది.
తెలంగాణ పోలీసులపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే రాజా సింగ్. మంత్రి కేటీఆర్ వల్లే మునావర్ షో చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
Also Read : బెంగళూరులో మునావర్ ఫరూఖీ షో రద్దు